SAKSHITHA NEWS

ఆడబిడ్డల మన్ కీ బాత్ వినండి

  • ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లకు ఢిల్లీ జంతర్ మంతర్ లో ఎంపీజే అధ్యక్షుడి సంఘీభావం

సాక్షిత :

ప్రధాని మోది ఆడబిడ్డల మన్ కీ బాత్ వినాలని మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తెలంగాణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ కు వెళ్లి అక్కడ ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్ లకు తమ మద్దతు తెలిపారు. వారితో మాట్లాడారు. దేశానికి పతకాలు తీసుకొచ్చి మనందరికీ గర్వకారణంగా నిలిచిన రెజ్లర్లు ఇలా రోడ్డు మీద ఆందోళన చేయాల్సి రావడం దురదృష్టకరమని ఆయన తీవ్రంగా ఆవేదన చెందారు. బ్రిజ్ భూషణ్ సింగ్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒలింపిక్స్‌ లో దేశానికి ఖ్యాతి తెచ్చినప్పుడు సంబరాలు చేసుకున్నామని.. ఇప్పుడు వాళ్లు న్యాయం కోసం పోరాడుతుంటే తప్పకుండా అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు


SAKSHITHA NEWS