స్వచ్చ సర్వేక్షనలో ప్రజా సహకారంతో ర్యాంక్ సాధించాలి – కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

SAKSHITHA NEWS

సాక్షిత : తిరుపతి నగర ప్రజల సహకారంతో అధికారులు, సిబ్బంది కృషితో స్వచ్చ సర్వేక్షన్ విషయంలో మొదటి ర్యాంక్ సాదించిన తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఆ ర్యాంకును నిలబెట్టుకోవడంతో బాటు మరింత మెరుగైన పని తీరును సాదించాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్వచ్చ సర్వేక్షన్ పై అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించిన కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగ నగరపాలక సంస్థ ప్రజలను చైతన్యం చేయడంతో బాటు సిబ్బంది కృషితో క్లీన్ సిటీగా సిద్ధం చేయడం ద్వారా ఈ సంవత్సరం కేంద్ర నిబందనలు చేరుకొని మొదటి ర్యాంకింగును చేరుకోవడం జరుగుతుందని కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ విశ్వాసం వ్యక్తం చేసారు. నగరంలో శానిటేషన్ శుభ్రత కోసం 102 ఆటోలను అన్ని డివిజన్లకు కేటాయించడం జరిగిందని, శానిటేషన్ సిబ్బంది ప్రతి ఒక్క ఇంటి నుండి తడి,పొడి చెత్తను విడివిడిగా తీసుకొని తూకివాకం ప్లాంట్ కి పంపిస్తే అక్కడ వాటిని రీ సైక్లింగ్ చేయడం జరుగుతుందన్నారు.

ముఖ్య సర్కిల్స్ వద్ద ఏర్పడుతున్న ఐలాండ్స్ ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని, మెయిన్ డ్రైన్ లలో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కట్టడికి కృషి చేయాలని, మునిసిపల్ వర్కర్స్ కి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేద్దామన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి కమిషనర్ హరిత విజ్ఞప్తి చేస్తూ తిరుపతిని క్లీన్ సిటీగా వుంచుకొనెందుకు సహకరించాలని, మీ ఇండ్ల వద్దకే వస్తున్న శానిటరీ సిబ్బందికి తడి పొడి చెత్తలను విడి విడిగా అందించాలని, కాలువల్లో వ్యర్థ పదార్థాలను, ప్లాస్టిక్ బాటిల్స్ ను వేయకుండా మునిసిపల్ సిబ్బందికి అందించేలా సహకారం ఇవ్వాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్చ సర్వేక్షన్లో ర్యాంక్ సాదించేలా అందరం‌ కలిసి సమన్వయంతో పని చేద్దామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప కమిషనర్ చంధ్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, డిఈలు విజయకుమార్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, సంజీవ్ కుమార్, గోమతి, మహేష్, నరేంధ్ర, శానిటరి సూపర్ వైజర్లు చెంచెయ్య, సుమతి, శానిటరి ఇన్స్ పెక్టర్లు, మేస్త్రీలు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 04 25 at 12.55.19 PM

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

ap జగనన్న మెగా లేఅవుట్పై విచారణ: చంద్రబాబు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSAP: YSR జిల్లా పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్పై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ఇక్కడ 8,400 ఇళ్లను మంజూరు చేసి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని MLC రాంగోపాల్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం స్థలాలు…


SAKSHITHA NEWS

bapatla బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSbapatla బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు, ఇండియన్ ఆర్మీ ఉద్యోగి షేక్ రజ్జు భాషా (42) విధి నిర్వహణలో జమ్ముకాశ్మీర్ లో గుండె పోటుతో మృతి చెందగా షేక్ రజ్జు భాషా పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన…


SAKSHITHA NEWS

You Missed

collector జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

collector జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

sitakka బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క

sitakka బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క

ap జగనన్న మెగా లేఅవుట్పై విచారణ: చంద్రబాబు

ap జగనన్న మెగా లేఅవుట్పై విచారణ: చంద్రబాబు

bapatla బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు

bapatla బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు

ganja పెందుర్తి పినగాడి వద్ద 20 కేజీలు గంజాయిని పట్టుకున్న పెందుర్తి పోలీసులు

ganja పెందుర్తి పినగాడి వద్ద 20 కేజీలు గంజాయిని పట్టుకున్న పెందుర్తి పోలీసులు

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

You cannot copy content of this page