SAKSHITHA NEWS

సాక్షిత వినుకొండ:- వినుకొండ మండలంలోని ఏనుగుపాలెం మరియు పెరుమాళ్ళపల్లి గ్రామాల మధ్యన కొంకేరు వాగు మీద బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి నేడు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కొంకేరు వాగును సందర్శించడం జరిగినది*


ఈ సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలనుండి పెరుమాళ్ళపల్లి, ఏనుగుపాలెం మధ్య పెరుమాళ్ళపల్లి నుండి వినుకొండకు రాకపోకలకు ఈ కొంకేరు వాగు వలన చాలా ఇబ్బందిగా ఉండేదని ఈ వాగు వలన ఈ రెండు గ్రామాల మధ్య 2 కిలోమీటర్లు ఉన్న దూరం సుమారు 30 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేయవలసి వస్తుందని గ్రామ ప్రజలు శాసనసభ్యుల వారు గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఈ గ్రామాలలో సందర్శిస్తున్న సందర్భంగా శాసనసభ్యులవారికి విన్నవించుకోవడం జరిగినది.

ఆ సంధర్భంగా శాసనసభ్యుల వారు ఈ కొంకేరు వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం చేస్తానని ఈ రెండు గ్రామాల ప్రజలకు హామీ ఇవ్వడం జరిగినది. ఇందులో భాగంగా ఈ రోజు ఏనుగుపాలెం, పెరుమాళ్ళపల్లి మధ్య కొంకేరు వాగును సంబంధిత అధికారులతో గ్రామ ప్రజలతో కలిసి సందర్శించిoచడం జరిగినది. ఈ గ్రామాల ప్రజలకు నేను ఇచ్చిన మాట ప్రకారమే ఈ బ్రిడ్జ్ నిర్మించడం నా బాధ్యత అని నా బాధ్యతని నెరవేర్చందుకు ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా మంజూరు చెపించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా రెవిన్యూ అధికారులను పంచాయతీ రాజ్ అధికారులను ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబందించిన భూ సర్వే, బ్రిడ్జ్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయవలసినదిగా ఆదేశించారు.


SAKSHITHA NEWS