SAKSHITHA NEWS

చిట్యాల లో బిజెపి 43వ ఆవిర్భావ వేడుకలు

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి సందీప్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ 43వ,ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిధిగా నల్లగొండ జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈసందర్భంగా పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ బిజెపి పార్టీ మహా నాయకుల ఆత్మబలిదానాలతో వెలసిన పార్టీ ఇద్దరు వ్యక్తులతో మొదలై నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వాలు నమోదైన పార్టీగా వెలిసిందని బిజెపి కార్యకర్తలు సిద్ధాంతంతో ఒక్కొక్క సైనికుడై పోరాడుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులను మీడియాను ఇబ్బందులకు గురి చేస్తూ వారి గొంతు నొక్కేస్తూ వాస్తవాలు బయటికి రాకుండా బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ని అరెస్టు చేసినందుకు బిఆర్ఎస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో గొలనుకొండ మదన్ మోహన్, దుబ్బాక నవీన్ రెడ్డి, చెరుకుపల్లి నాగరాజు, సోమనబోయిన విగ్నేష్, గుణగంటి రాఘవేంద్ర, ఉయ్యాల సుమంత్, కొండ రమేష్ లింగస్వామి రాజు పవన్ తదితరలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS