SAKSHITHA NEWS

విజయవాడ ప్రజల దాహం తీర్చిన స్వచ్ఛంద సంస్థ..

అభినందించిన స్థానిక ప్రజలు..

గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న ప్రజలకు పొట్నూరి అంజలి చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది..

చల్లని మజ్జిగతో ప్రజలకు గొంతు తడిపింది..

బాటసారులకు బాసటగా నిలిచిన ట్రస్ట్..

నేనున్నానంటూ భరోసా నింపింది పొట్నూరి అంజలి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొట్నూరి అంజలి..

బాటసారుల గొంతు తడిపి దప్పిక తీర్చిన ట్రస్ట్ చైర్మన్ పొట్నూరి అంజలి నీ స్థానిక ప్రజలు అభినందించారు.. విజయవాడ కొత్తపేట కేబీఎన్ కాలేజీ వద్ద పొట్నూరి అంజలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు…ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ అంజలి మాట్లాడుతూ..

మండుతున్న ఎండలకు మంచి నీళ్ళు కోసం ప్రజలు అల్లాడుతున్నారని, ఇలాంటి చలివేంద్రాలు వారికి ఎంతగానో ఉపయోపడతాయని ఆమె అన్నారు..

2018 వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు క్రమం తప్పక ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి జూన్ నెల వరకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నామని వివరించారు..

సుమారు 500 మంది పాదచారులకు మజ్జిగ పంపిణీ చేపట్టారు..


SAKSHITHA NEWS