సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు శివకుమార్ యాదవ్ రాత్రి దుండగుల చేతిలో గాయపడి చింతల్ లోని ఆర్ఎన్సీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఉదయం హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు. దాడి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకొని ధైర్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు సోమేశ్ యాదవ్, గాజులరామారం డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నేతను పరామర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..
Related Posts
మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు
SAKSHITHA NEWS మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు శంకర్పల్లి : దేవీ నవరాత్రులలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజిస్తారు. కొండకల్ గ్రామం లో అన్నపూర్ణ దేవికి చరణ్ సార్క్ ప్రాజెక్ట్స్ వారి ఆధ్వర్యం లో…
కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి.
SAKSHITHA NEWS కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి. సన్మానం చేసిన చేవెళ్ల న్యాయవాదులు. చేవెళ్ల : మట్టిలో పుట్టిన మాణిక్యంలాగా పరిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తి కూతురు కాలోజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చేవెళ్ల గ్రామంలో…