SAKSHITHA NEWS

రామన్నపేట (సాక్షిత ప్రతినిధి)

చిరుధాన్యాలను తినడం వల్ల ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఎన్నో ఉన్నాయని ఐసిడీఎస్ సీడీపీఓ శాగంటి శైలజ అన్నారు. పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా భాగంగా రామన్నపేట ప్రాజెక్టు పరిధి లోని అంగన్వాడీ కేంద్రంలో భార్యభర్తలకు చిరుధాన్యాల తో కూడిన వంటల పోటీ నిర్వహించి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. సామ్ లో ఉన్న పిల్లలని నార్మల్ కు తీసుకు వచ్చిన
తల్లిదండ్రులను అభినదించడం జరిగింది. ఈ సందర్భంగా సిడిపిఓ శైలజ మాట్లాడుతూ చిరుధాన్యలని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. చిరుధాన్యాల
ప్రాధాన్యత వాటిని ఎలా ఉపయోగించాలో తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఏసీడిపిఓ సమీరా మీర్జా,సూపర్ వైసర్స్ హేమలత, ధనమ్మ, శ్రీలత, నిర్మల,శ్రీదేవి మరియు అంగన్వాడీ టీచర్లు లలిత, సువర్ణ, కవిత లలిత, రేణుక ఆశ వర్కర్లు లలిత జానకి ఇందిరా అండాలు మరియు తల్లులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS