SAKSHITHA NEWS

యాదయ్య కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన జెడ్పీటీసీ బలరాం

కట్టంగూర్ (సాక్షిత ప్రతినిధి)

కట్టంగూర్ మండలం ఇస్మాయిల్ పల్లి గ్రామ పరిధి గోల్లగూడెం గ్రామానికి చెందిన మేడబోయిన యాదయ్య అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలిసిన జెడ్పీటీసీ తరాల బలరాం, యాదయ్య
భౌతికగాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ
వారి కుటుంబం సభ్యులకి 5వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజెశారు. ఎంపిటిసి మల్లేబోయిన శ్రీలత కృష్ణ,మండల నాయకులు ఆంజనేయులు, గ్రామ శాఖ అధ్యక్షులు కారింగ్ లింగస్వామి,మరెడ్డి రాం రెడ్డి,అలుగుబెల్లి సైదిరెడ్డి, మేడబోయిన సైదులు, మేడబోయిన నరేష్, తదితరులు నివాళలర్పించారు.


SAKSHITHA NEWS