SAKSHITHA NEWS

త్రిపురాంతకంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవం.

తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తిచేసుకుని 41 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా..!

టిడిపి జెండా ఎగుర వేసిన మండల అధ్యక్షులు.. మేకల వలరాజు యాదవ్ .

ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో బుధవారం టిడిపి ఆవిర్భావ దినోత్సవంను త్రిపురాంతకం మండల టిడిపి అధ్యక్షులు మేకల వలరాజు యాదవ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి భారీ పూలమాల వేసి నివాళులు అర్పించారు.
జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేసారు.

త్రిపురాంతకంలోని మోటకట్ల నాసరరెడ్డి విగ్రహం వద్ద టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి మండల టిడిపి అధ్యక్షులు మేకల వలరాజు అధ్వర్యంలో జెండా ఎగురవేసి, కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోటకట్ల శ్రీనివాసరెడ్డి, దేవినేని చలమయ్య, వంకాయలపాటి ఆంజనేయులు, వూట్ల వెంకటేశ్వర్లు, మల్లెల అల్లూరిరెడ్డి, కటికీ ఏడుకొండలు, గుత్తా వెంకటనారాయణ, తెలుగుయువత అధ్యక్షుడు వి.అంకరావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వర్ధన్ బాబు, బీసీ సెల్ అధ్యక్షుడు సిరిగిరి గోవిందు, బాదుర్లు, బంకా ఆవులయ్య, తదితర నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు…


SAKSHITHA NEWS