SAKSHITHA NEWS

చందాలతో నీళ్లటాంక్

*సాక్షిత ప్రకాశం జిల్లా : యర్రగొండపాలెం మండలం వీరాయపాలెం గ్రామంలో త్రాగునీరు లేక గ్రామస్థులు చాలా అవస్థలు పడుచున్నారు. మొక్కుబడిగా ఒక ట్యాంక్ ఉన్నప్పటికీ, దానికి నీరు సరిగ్గా అందక, వచ్చిననీరు అందరికి సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులకి, ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు చెప్పినా, తమ గోడు పట్టించుకునే నాధుడే లేడని విసిగిపోయిన గ్రామస్థులు,

20 వేల రూపాయలు చందాలు వేసుకొని ట్యాంక్ నిర్మించుకున్నారు . కూలి చేసుకొని సంపాదించిన సొమ్ముతో పూటగడవడమే కష్టంగా ఉందని, ఉన్నతాధికారులు నీటి సమస్య పట్టించుకోకపోవడం తో తామే నిర్మించుకున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ ట్యాంక్ తో 70 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు


SAKSHITHA NEWS