SAKSHITHA NEWS

సాక్షిత : అమరజీవి పొట్టి శ్రీ రాములు జయంతి సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినుకొండ MLA కార్యాలయంలో పొట్టి శ్రీ రాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

తదుపరి పట్టణంలోని పలు ప్రాంతాల్లో గల వారి విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి మహాపురుషుడు.. శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు ప్రాతఃస్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకోసం జీవితాంతం కృషిచేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీ రాములు గారని తెలిపారు


SAKSHITHA NEWS