SAKSHITHA NEWS

మద్దూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆర్.టి.ఐ దరఖాస్తు చేసిన మాజీ సైనికుడు

బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి*

మద్దూర్

సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం నర్సయపల్లి గ్రామానికి చెందిన పదవి విరమణ చేసిన భారత సైనికుడు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి, మద్దూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో 2019-2020,2020-2021,2021-2022,2022-2023 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 13th, స్టేట్ ఫైనాన్స్, జనరల్ ఫౌండ్, పార్లమెంట్ సభ్యులకు లకి సంబందించిన ఎమ్మెల్యే. ఎంపీ ల కోటాలో వచ్చిన నిధులు,మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం వివరాలకు, ఎం పి ఓ, ఎంపీడీవో. ఎంపీపీ.

జీతాలు బత్యాలు గురించిన వివిధ అంశాలు పై మద్దూర్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయకి సంబందించిన బిల్లులు, తీర్మానలు, ఎంబి రికార్డ్స్ వోచర్లు, ఛేక్యూ , ఇష్యూ రిజిస్టర్, ఛేక్కులు జిరాక్స్ లకు సంబందించిన రికార్డులు అందుబాటులో ఉంచగలరని దరఖాస్తు లో పేర్కొన్నారు.


SAKSHITHA NEWS