SAKSHITHA NEWS

Dhanurmasam celebrations in Kuppili village

కుప్పిలి గ్రామంలోఘనంగా ధనుర్మాసం మేలుకొలుపులు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో ధనుర్మాసం సందర్భంగా మేల్కొలుపు,రామయ్యా విగ్రహం తిరువీధుల్లో ఊరేగింపు కార్యక్రమాన్ని కోదండ రామయ్య భజన బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్య భజనా బృందం సబ్యులు మాట్లాడుతూ ధనుర్మాస ప్రారంభం నుండి నెల రోజుల పాటు మేల్కొలుపు కార్యక్రమం జరుగుతోందని,గత ఆరు సంవత్సరాల నుండి ధనుర్మాస మేల్కొలుపు, కోదండ రామయ్య విగ్రహం ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని,మండల పరిధిలోని లక్ష్మీపురం, నేతేరు,లో పెంట,నేదురుపేట,కొచ్చెర్ల,కొయ్యం,గ్రామాల్లో కోదండ రామయ్య ను ఊరేగిస్తూ,ప్రతీ ఇంటి వద్ద నుండి సేకరించిన బియ్యాన్ని ధనుర్మాస అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో చిన్నారులు,మహిళలు,కమీటీ సబ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS