రఘువీరారెడ్డి ఎక్కడ నేను వారితో మాట్లాడాలి

Spread the love

రఘువీరారెడ్డి ఎక్కడ ? నేను వారితో మాట్లాడాలి :- రాహుల్ గాంధీ .

ఆంధ్రప్రదేశ్ /డి.హిరేహాల్ :- కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఉదయం ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో ప్రవేశించింది. రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చిన వెంటనే రఘువీరారెడ్డి ఎక్కడ ? నేను వారితో మాట్లాడాలి అని నాయకులకు చెప్పారు.

ఆ సమయంలో రఘువీరారెడ్డి కాస్త దూరంగా ఉన్నారు అనంతరం నాయకులు వచ్చి సార్ రాహుల్ గాంధీ మిమ్మల్ని పిలుస్తున్నారు మీరు వెంటనే రావాలని తెలియజేశారు. రాహుల్ గాంధీ ని కలిసి నీలకంఠాపురం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన శేషవస్త్రాన్ని, తీర్ధ ప్రసాదాలను అందించిన రఘువీరా రెడ్డి . విరామం సమయంలో చాలాసేపు వీరి ఇద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.

రఘువీరారెడ్డి మీరు నాతో పాటు పాదయాత్రలో పాల్గొనాలని తెలిపిన రాహుల్ గాంధీ . వారి మాటను అనుసరిస్తూ పది కిలోమీటర్ల మేర పాదయాత్రలో పాల్గొన్న రఘువీరారెడ్డి.

Related Posts

You cannot copy content of this page