SAKSHITHA NEWS

సాక్షిత : రక్షాబంధన్ సందర్భంగా శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో తన సోదరీమణులు రాణి, రమ, లక్ష్మి లు రాఖీలు కట్టి స్వీట్స్ తినిపించారు. అనంతరం వారు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆశీస్సులు తీసుకున్నారు. అదేవిధంగా మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, ఏసూరి సావిత్రి, బ్రహ్మకుమారి సునీత, నియోజకవర్గ పరిధిలోని పలువురు ముస్లీం మహిళలు మంత్రికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా మంత్రి రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు.


SAKSHITHA NEWS