ఉప్పలపాడు గ్రామం లో ఆజాదీ కా అమృత మహోత్సవం

Spread the love

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం ఉప్పలపాడు గ్రామం లో ఆజాదీ కా అమృత మహోత్సవం లో భాగంగా అమృత సరోవర్ చెరువు కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులతో కలిసి చెరువు కట్టపై ర్యాలీ నిర్వహించారు. కట్టల పైన అనంతరం మెక్కలు నాటారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, స్వాతంత్య్ర వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా ప్రతి ఒక్కరూ వారి ఇంటి పై మువ్వన్నెల జెండా ఎగరవేసి దేశ భక్తి ని చూపాలని, ఆనాడు ఎందరో వీరుల త్యాగ ఫలం ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని అన్నారు. పొరుగు దేశాల లో భానిసలుగా ఉన్న మనం ఈ నాడు స్వేచ్ఛ గా జీవిస్తున్నాం అంటే ఆ నాటి వీరుల త్యాగమేనని వారిని ఎప్పటికి మనం మరవ కూడదని అన్నారు.

Related Posts

You cannot copy content of this page