SAKSHITHA NEWS

జయశంకర్ సార్ కు ఘన నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ..
సాక్షిత : తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఖమ్మం నగరం దంసలాపురం సర్కిల్ నందు జయశంకర్ సార్ విగ్రహానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

వారు చూపిన మార్గం, ఉద్యమ పాఠాలు, చైతన్యం.. యావత్తు తెలంగాణ సమాజం గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని అన్నారు.

సార్.. ఆశించినట్లుగా స్వయం పాలన సాకరమై, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

మేయర్ పునుకొల్లు నీరజ , జిల్లా కలెక్టర్ VP గౌతమ్ కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు.


SAKSHITHA NEWS