SAKSHITHA NEWS

దళిత బంధు పథకం ఓ వరం…

*
: సాక్షిత : దళిత బంధు ద్వారా ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ & ఫ్యాబ్రికేషన్, ఫ్లోర్ మిల్ షాప్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే…*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని లాల్ సాహెబ్ గూడ గ్రామానికి చెందిన బి.శ్రీనివాస్ రాజు మరియు బి.కుమార్ లు చింతల్ 128 డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ లో దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసిన తేజస్విని ఇంజనీరింగ్ & ఫ్యాబ్రికేషన్, ఫ్లోర్ మిల్ షాప్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ దళితులను ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి వారిని ఆదుకుంటున్నారని అన్నారు. దళిత బంధు పథకం యావత్‌ దేశానికే ఆదర్శవంతంగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తంగ లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, సీనియర్ నాయకులు మక్సూద్ అలీ, బస్వరాజు, శేఖర్ రావు, వెంకటేష్ గౌడ్, ప్రభాకర్ గుప్త, ప్రకాష్, దళిత సంఘాల ఐక్య వేదిక చైర్మన్ మద్దెల సత్యనారాయణ, బుచ్చన్న, జేమ్స్ మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS