SAKSHITHA NEWS

పార్టీలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం….

ప్రజా పాలన గ్రామ సభ కు హాజరైన ఎమ్మెల్యే

గద్వాల నియోజకవర్గం గట్టు మండలం గట్టు గ్రామం పాటు మండల పరిధిలోని గ్రామాలలో ఆరగిద్ద గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, మరియు ఇందిరమ్మ ఇండ్ల పథకాల పై గ్రామ సభ ను నిర్వహించి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి * హాజరయ్యారు.

త్వరలోనే ఆరగిద్ద నూతన సబ్స్టేషన్ ప్రారంభిస్తారు అని తెలిపారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ……

నన్ను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించి మరొకసారి అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలలో భాగం లో ఇప్పటికే ఫ్రీ బస్సు , 500 రూపాయల సబ్సిడీ గ్యాస్,200 యూనిట్ కరెంటు, రుణమాఫీ వంటి కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26వ తేదీ నాడు ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన నాలుగు పథకాలకు ప్రారంభించడం జరిగింది ఇందులో రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మరియు రేషన్ కార్డులు పథకాలను అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోని గతంలో గ్రామసభలో నమోదు చేసుకోలేనివారు ఎవరైనా ఉంటే మరొక అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు . గ్రామసభ లో అర్హులైన వారికి ఎంపిక చేసి వారికి ఈ సంక్షేమ పథకాలను అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.

గ్రామ సభలో ఎవరికైనా రాలేదని వారు ఉంటే .మండల కార్యాలయంలో ఒక్కరికి ప్రజా పాలనలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు.

ఈ సంక్షేమ పథకాలలో నిరుపేదలు భూమిలేని వారికి ఎంపిక చేసి ఇందిరమ్మ భరోసా, ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు ఎకరానికి రెండు పంటలు చొప్పున 12 వేల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది.

అదేవిధంగా గ్రామంలో నిజంగా అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 5 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లలో కూడా నిజమైన నిరుపేదలకు నివాసం లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలు 3500 కేటాయించడం జరిగింది. ప్రతి గ్రామంలో నిరుపేదలకు ఇల్లు లేని వారికి, వికలాంగులకు, ఒంటరి మహిళలకు , ట్రాంజెండర్, ప్రాధాన్యత కల్పించడం జరుగుతుంది

ఇందిరమ్మ ఆత్మీయ పథకంలో గ్రామంలో నిరుపేద ఇలాంటి భూమిలేని వారికి 20 రోజులు పాటు ఉపాధి హామీ ఉన్నవారికి ఎంపిక చేయడం జరిగింది. వీటిలో అర్హులైన వారికి ఎంపిక చేసి వారికి ప్రభుత్వం నుండి వస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ పథకాన్ని అందిస్తామని తెలిపారు.

అలాగే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేయడం జరిగింది. అర్హులైన వారికి ఎంపిక చేసి రేషన్ కార్డు లు అందించడం జరుగుతుంది. అదేవిధంగా. రేషన్ కార్డులో పేర్లను ఎక్కించు కొనడానికి కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. కొత్తగా వివాహం చేసుకున్న వారికి కూడా రేషన్ కార్డును అందించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగి రేషన్ కార్డు రానివారు మరొకసారి ఈ ప్రజా పాలనలో గ్రామసభ నందు నమోదు చేసుకుంటే వారికి కూడా త్వరగా రేషన్ కార్డు వచ్చే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.