SAKSHITHA NEWS

వనపర్తి వాసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ను సన్మానించిన …….బిజెపి నాయకులు


సాక్షిత వనపర్తి : *వనపర్తి ప్రాంతవాసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా నియామకమైన చల్ల శ్రీనివాసులు శెట్టి తన సొంత పట్టణం వనపర్తి లోని తమ నివాసానికి విచ్చేశారన్న విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఓబిసి అధికార ప్రతినిధి శ్రీశైలం రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి రాష్ట్ర ఓబిసి కోఆర్డినేటర్ చిత్తారి ప్రభాకర్ మాజీ వైస్ చైర్మన్ బాశెట్టి శ్రీనివాసులు మాజీ కౌన్సిలర్ ఏ సీతారాములు రామన్న వెంకటేశ్వర రెడ్డి వనపర్తి పట్టణ అధ్యక్షులు కార్యదర్శి నవీన్ చారి లు వారి నివాసానికి చేరుకొని ఘనంగా స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన వనపర్తి ప్రాంతవాసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా చైర్మన్ చైర్మన్గా నియమితు లు అయినందుకు ఎంతో గర్వంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు వారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులను అధిష్టించాలని అభిలాషించారు


SAKSHITHA NEWS