SAKSHITHA NEWS

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ గారి వర్ధంతి సందర్బంగా ఆ మహానేత కు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్బంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు షాపూర్ నగర్ లోని తన నివాసం వద్ద ఆ మహానేత చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మహానేత వైఎస్సార్ గారి సేవలను కొనియాడారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ అనేక సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలను గెలిచిన మహానేత వైస్సార్ అని కొనియాడారు. సమకాలీన రాజకీయాల్లో వైస్సార్ గారి లోటు తీరనిది అని అన్నారు. వైస్సార్ గారి ఆశయాల సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు


SAKSHITHA NEWS