SAKSHITHA NEWS

మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో కో ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది.
రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మరియు వివిధ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గణేష్ మండప నిర్వాహకులకు సూచనలు, సలహాలు అందించారు. ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా భక్తి భావంతో జరుపుకోవాలని సూచించారు. ప్రతి మందంపం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులతో సమన్వయం చేసుకుని ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని తెలిపారు.


SAKSHITHA NEWS