SAKSHITHA NEWS

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
-ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
అనపర్తి, సాక్షిత : అనపర్తి నియోజకవర్గం అనపర్తిలో రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో మరియు అనపర్తి సావరం లలో మిషన్ హరితాంధ్రప్రదేశ్ “వనo -మనం” కార్యక్రమాన్ని ఎన్డియే నాయకులు, అధికారులతో కలిసి శుక్రవారం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజలు యువత భాగ్యస్వాములు కావాలన్నారు. మొక్కలు నాటడం తో పాటు వాటి పరిరక్షణకు కృషి చేయాలన్నారు. పర్యావరనాన్ని పరిరక్షించడానికి ప్రతీ ఒక్కరూ తమ వంతు భాద్యత గా మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్డియే నాయకులు, అనపర్తి టౌన్, అనపర్తి సావరం ఎన్డియే నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గోన్నారు.


SAKSHITHA NEWS