SAKSHITHA NEWS

నేడు విద్యుత్ అంతరాయం
రాజమహేంద్రవరం, సాక్షిత :
బుధవారం ఉదయం: 07.00 నుండి మధ్యాహ్నం 11: 00 వరకు 11 కేవీ లైన్ పనుల నిమిత్తం
కోరుకొండ రోడ్డు ఏరియా, విద్యానగర్ పి.& టీ కాలనీ , సుభాష్ నగర్, మార్కెట్ యార్డ్ , విద్యుత్ సబ్-స్టేషన్ పరిధిలోని విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయడం జరుగుతుందని ఎక్జిక్యూటివ్ఇంజినీరు, ఆపరేషన్, ఏ.పి.ఈ.పి.డి.సి.ఎల్ రాజమహేంద్రవరం వారు ప్రకటనలో తెలిపారు. మరియు ఉదయం 8.00 గం.ల నుండి మధ్యాహ్నం 12.00 గం.ల వరకు 11 కెవి ఆర్టీసీ డిపో ఫీడెర్ మీద చెట్లకోమ్మల కత్తిరింపు నిమిత్తం విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం జరుగుతుందని నగరం నందు గల గాంధిపురం,-3, శీలం నూకరాజు కంపెనీ లైన్, శ్యామలనగర్, గోరక్షణ పేట, డైమండ్ పార్క్ మొదలగు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగునని తెలియజేశారు


SAKSHITHA NEWS