SAKSHITHA NEWS

నామినేటెడ్ పదవులపై చర్చ

అమరావతీ : టీడీపీ అధినేత మరియు సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన ఈనెల 8న పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ
జరగనుంది. నామినేటెడ్ పదవుల పంపకం, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై సీనియర్ నేతలు చర్చించనున్నారు. అలాగే విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిపై నిర్ణయం
తీసుకోనున్నారు.


SAKSHITHA NEWS