SAKSHITHA NEWS

తల్లి పార్ధివ దేహాన్ని స్వచ్చందంగా మెడికల్ కళాశాల కు అప్పగించిన ప్రగతి నగర్ మాజీ సర్పంచ్

సాక్షిత కుత్బుల్లాపూర్:
హైదరాబాదులోని ప్రగతి నగర్ వాస్తవ్యులు, ప్రగతి నగర్ మాజీ సర్పంచ్ దుబ్బాక దయాకర్ రెడ్డి, వారి సోదరి కుకునూరు సరళ మరియు ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో 26/ 7 /2024 రోజు మరణించిన వారి తల్లి న దుబ్బాక వజ్రమ్మ భౌతిక కాయని స్వచ్ఛందంగా 27/7/2024న మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ బాచుపల్లి మెడికల్ కాలేజీకి డెడ్ బాడీని దానం చేశారు.మరణించిన తర్వాత దేహాన్ని కాల్చి పూడ్చడం కన్నా మెడికల్ కాలేజీలకు ఇవ్వడం వల్ల ఎంతోమంది వైద్య విద్యార్థులకు ప్రయోజనం చేకూరి సమాజానికి ఉపయోగపడుతుందని మమత మెడికల్ కాలేజ్ డీన్ హరికృష్ణ వైస్ ప్రిన్సిపాల్ బి, నవీన్ కుమార్ మరియు అనాటమీ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ ఆ కుటుంబ సభ్యులను అభినందించారు.


SAKSHITHA NEWS