SAKSHITHA NEWS

EAPCET సర్టిఫికెట్ వెరిఫికేషన్.. లాస్ట్ డేట్
తెలంగాణలో EAPCET రెండో విడత కౌన్సెలింగ్ లో భాగంగా విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు నేటితో గడువు ముగియనుంది. రేపు, ఎల్లుండి ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 31న సీట్లు కేటాయింపు ఉంటుంది. మొదటి విడతలో మిగిలిన సీట్లతో కలిపి తాజా కౌన్సెలింగ్ లో మొత్తం 29,777 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా, తొలి కౌన్సెలింగ్ లో 75,200 మందికి సీట్లు కేటాయిస్తే 55,941 మంది విద్యార్థులే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు.


SAKSHITHA NEWS