SPEAKER స్పీకర్ అయ్యన్నతో సమావేశమైన అనకాపల్లి జిల్లా కలెక్టర్
…………………………………………………………
సాక్షిత : అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నీ నర్సీపట్నం అయ్యన్న నివాసంలో మర్యాదపూర్వకంగాకలిసారు.నర్సీపట్నం అభివృద్ధి మరియు సమస్యలపై కలెక్టర్ విజయ కృష్ణన్ తో స్పీకర్ అయ్యన్న చర్చించారు.నర్సీపట్నం గబ్బాడ ఇసుక రీచ్ పై వీలైనంత త్వరగా సమగ్ర విచారణ జరిపించాలి.నర్సీపట్నం మునిసిపాలిటీలో పారిశుద్ధం అస్తవ్యస్తంగా ఉంది.జేసిబి, కాంపాక్ట్ రిపేరు అయ్యే కొన్ని నెలలు అవుతున్న ఇప్పటికీ రిపేరు కాకపోవడం వల్ల మునిసిపాలిటీ ఆధాయం కు నష్టం.అద్దె జేసిబిలు ద్వారా రోజుకు 2,000 రూపాయలు అద్దె చెల్లిస్తున్నట్లు మునిసిపాల్ కమిషనర్ రవి బాబు తెలిపారు.ఇప్పటివరకు ఇచ్చిన అద్దె డబ్బులతో కొత్త జేసిబిలు వస్తాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.నర్సీపట్నం మున్సిపాలిటీ పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ కు సూచించారు.నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి పూర్వ వైభవం తీసుకురావడానికిచర్యలు.వేములపూడి గర్ల్స్ హాస్టల్ లో సరైన బాత్రూమ్ లు లేక విద్యార్థినిలు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.తక్షణమే బాత్రూమ్ లు ఏర్పాటు చేయాలని సూచన.నర్సీపట్నం మున్సిపాలిటీ పరిసర ప్రాంతం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ విజయ కృష్ణన్ హామీ.
వారితో పాటు నర్సీపట్నం ఆర్డిఓ జయరాం మున్సిపల్ కమిషనర్ రవిబాబు పాల్గొన్నారు
SPEAKER స్పీకర్ అయ్యన్నతో సమావేశమైన అనకాపల్లి జిల్లా కలెక్టర్
Related Posts
ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
SAKSHITHA NEWS ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ రికార్డ్ దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ లో…
గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు వెళ్లనున్న
SAKSHITHA NEWS గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు వెళ్లనున్న ఎపి సిఎం చంద్రబాబు నాయడు. గాంధీనగర్ లో రేపటి నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొననున్న ఎపి సిఎం రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్ లో పెట్టుబడులకు రాష్ట్రంలో…