SAKSHITHA NEWS

cm ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన

ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి

ఈరోజు హైదరాబాదులోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షించారు. ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి కి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. రాయచూరు -ఐజ -శాంతినగర్ -అలంపూర్ – నందికొట్కూరు – శ్రీశైలం ( అంతర్రాష్ట్ర హైవే ) 4వే లైన్ రోడ్డు వేస్తే బాగుంటుందని జోగులాంబ ఆలయం అభివృద్ధి అవుతుందని.మల్లమ్మ కుంట రిజర్వాయర్ వల్లూరు రిజర్వాయర్,అలంపూర్ వాసులకు ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లో కూడా వర్తించేలా… నెట్టెంపాడు 100 ప్యాకేజ్ పై.. ఇలా పాలు… అంశాలు ముఖ్యమంత్రి కి వినతిపత్రంలో అందజేయడం జరిగినది.ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన ఇస్మాయిల్ మరియు ఇబ్రహీం కుటుంబానికి 20 లక్షలు ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి సహాయ నిధి అభ్యర్థన. 1) షేక్ సమీర్ (18) సంవత్సరాలు 2) షేక్ రిహాన్ (14) ఇస్మాయిల్ ఇద్దరు కుమారులు 3) షేక్ అఫ్రిన్ (17) సంవత్సరాలు 4) షేక్ నౌషిన్ (13) సంవత్సరాలు ఇబ్రహీం కుమార్తెలు ఇద్దరు దురదృష్టవశాత్తు కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి మరణించారు. ముఖ్యమంత్రి నిధిలో ఆ కుటుంబాలకు సాయం అందించాలని కోరారు. ముఖ్యమంత్రి దీనికి సానుకూలంగా స్పందించారు.

cm

SAKSHITHA NEWS