వచ్చే నెలలో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలో ఒకే వేదికపై కనిపించనున్నారు. జులై మూడో వారంలో మొట్టమొదటి ప్రపంచ కమ్మ మహాసభలు హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ విషయాన్ని కమ్మ మహాసభ నిర్వాహకుడు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీ ఈ ప్రపంచ కమ్మ మహాసభ వేడుకలకు వేదికగా నిలవనుంది.
![వచ్చే నెలలో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి 2 వచ్చే నెలలో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-28-at-19.17.55.jpeg)