SAKSHITHA NEWS

Will work with India on key issues: Trudeau

కీలక విషయాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తాం: ట్రూడో

భారత్‌-కెనడా సంబంధాలు నామమాత్రంగా ఉన్న సమయంలో ఇరు దేశాల ప్రధానులు కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు జీ-7 దేశాల సదస్సు సందర్భంగా ఇటలీలో వీరిద్దరూ భేటీ అయ్యారు.

భేటీ అనంతరం కెనడా ప్రధాని జస్టిన్‌ జస్టిన్‌ ట్రూడో మాట్లాడుతూ ముఖ్యమైన అంశాలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇరు దేశాలు కలిసి పని చేయాల్సిన సున్నితమైన అంశాల జోలికి తాను వెళ్లడం లేదని తెలిపారు.


SAKSHITHA NEWS