People of Andhra Pradesh wanted Chandranna.
కోవూరు మండలం పెద్ద పడుగుపాడు గ్రామ ప్రజల సమక్షంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారని శుభ సందర్భంగా, అలాగే ఎంపీ గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు నియోజకవర్గం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, గెలవడంపై పెద్ద పడుగు పాడు టిడిపి నాయకుల ఆధ్వర్యంలో విజయోత్సవం చేసుకోవడం జరిగింది, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, అంటూ కేక్ కట్ చేసి పెద్ద పడుగు పాడు గ్రామ ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు, అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని ఆంధ్రప్రదేశ్ కు అసలు రాజధాని లేదని ప్రజలు ఎంత విసిగిపోయారో వారిచ్చిన మెజార్టీ మనకు చెబుతుంది, చంద్రన్న ముఖ్యమంత్రి అయ్యాడు రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవడం ఖాయమని, మనకు అమరావతి రాజధాని అవ్వడం కూడా అంతే ఖాయమని, తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షేక్. నాసర్, షేక్. మహమ్మద్, దారపనేని శ్రీనివాసులు నాయుడు, సూరిశెట్టి శ్రీనివాసులు, గొల్లపోలు పుల్లయ్య, ఎస్. డి. గౌస్ బాషా, ఎస్. డి. తాజుద్దీన్, ఎస్.కె. షఫీ, ఎస్.కె .రఫీ ,అనిల్, హరిబాబు, గొల్ల పోలు సూర్యం, వహీద్, సమీర్, నయాజ్, మోసిన్, రమేష్, తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
![చంద్రన్న కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నారు. 2 WhatsApp Image 2024 06 13 at 18.21.21](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-13-at-18.21.21-1024x629.jpeg)