సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బీఫారం అందుకున్న పద్మారావు గౌడ్

Spread the love

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత ..మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తీగుళ్ల పద్మారావు గౌడ్ పార్టీ బీఫారం అందుకున్నారు.. ఈ సందర్భంగా ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నుండి రూ.95లక్షల చెక్కును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందజేశారు.

అంతకుముందు జరిగిన సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు,విధానాలపై గులాబీ దళపతి కేసీఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు వివరించారు..

ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్,ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్,జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్,కార్పోరేటర్లు,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గోన్నారు..
..

Related Posts

You cannot copy content of this page