SAKSHITHA NEWS

పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా మహబూబాబాద్ ఎంపీ క్యాంప్ కార్యాలయంలో
మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న
భారసజిల్లాఅధ్యక్షులు
మహబూబాబాద్పార్లమెంట్సభ్యులు
కవిత_మాలోత్

ఈ సందర్భంగా #కవితమ్మ మాట్లాడుతూ….

పిలవగానే ఇంత పెద్ద ఎత్తున సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి పెరు పెరు న ధన్యవాదాలు తెలియజేసారు…తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకుని దేశంలోనే నంబర్ వన్ గా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ ది అని గుర్తు చేశారు…

అన్ని ఫ్రీ ఫ్రీ అనగానే ప్రజలు అదే మాయలో పడిపోయారని ,అదే మాయలో ఓట్లు వేశారని గుర్తు చేశారు..

మరి ప్రజలు ఎం అనుకున్నారో ,ఏమి మాయ జరిగిందో తెలియదు కాని,కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు నమ్మి కాంగ్రెస్ ను గెలిపించి కష్టాలను కొనితెచుకున్నారు అని చెప్పారు…

ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని అబద్దాలు చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసి మొహం చాటేసి తిరుగుతున్నారని అన్నారు..

దేశానికి ఆదర్శంగా తెలంగాణ తీర్చి దిద్దితే ,అభివృద్ధి పైన విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు…

ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టి తెలంగాణ ను సస్యశ్యామలం చేస్తే,ఎదో ఒక పిల్లర్ కుంగితే ప్రబుత్వం ఏర్పాటు చేసిన రోజు నుండి అదే పనిగా ప్రాజెక్ట్ పైన అసత్యాలు ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నారని ఎద్దవ చేశారు…

కుంగిన పిల్లర్ సాకు చూపిస్తూ ,తెలంగాణ పచ్చని పంట పొలాలను ఎండబెడుతున్నారు వాపోయారు…

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కశ్చితంగా భారాస పార్టీకి ఓటు వేసి మన హక్కుల కొరకు పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతుకకు తోడుగా నిలవాలని విజ్ఞప్తి చేసారి..

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సంక్షేమ పథకాలు అమలు చేయించడానికి మీ తరపున పోరాటం చేయడానికి నన్ను గెలిపించాలని కోరారు…

నాకు మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లో ప్రతి ఒక్క మనిషితో ఆత్మీయ సంబంధం ఉందని, ప్రతి ఒక్కరు వారి ఇంటి అడబిడ్డలగా నన్ను ఆదరిస్తున్నారు ,ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలని నన్ను మీరూ అందరూ ఆశీర్వదించాలని వారిని కోరారు…

మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లో ప్రతి గ్రామంలో కార్యకర్తలను దాదాపుగా పెరు పెట్టి పిలిచే అంత సన్నిహిత్యం నాకు ఉందని గుర్తు చేశారు..

మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అబ్యర్ది అసెంబ్లీ ఎన్నికల్లో అనర్హుడు అని పక్కన పెట్టి ,మళ్ళీ అదే అబ్యర్ది పార్లమెంట్ అబ్యర్ది గా ప్రకటించడం హాస్యాస్పదం.. అసెంబ్లీ లో చెల్లని రూపాయి పార్లమెంట్ కి ఎలా చెల్లుతుందో చెప్పాలని అడిగారు..

ప్రతి సారి ఎన్నికల రవగానే ఎదో పొలిటికల్ టూరిస్ట్ కాగా వచ్చి ,ఎన్నికలు అయిపోగానే హైదరాబాద్ వెళ్ళిపోయే వారిని నమ్మి మోసపోకండి అని ప్రజలను కోరారు…

దయచేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారాస కారు గుర్తు కు ఓటు వేసి అత్యధిగా మెజారిటీ మన మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇవ్వాలని చేతులు జోడించి అందరిని వేడుకున్నారు…

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP


SAKSHITHA NEWS