SAKSHITHA NEWS

న్యూఢిల్లీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హజారత్ నిజాముద్దీన్ బాబా దర్గాలో ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ శిక్షణ శిబిరం మాజీ డైరెక్టర్, ఎచ్చెర్ల నియోజవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు

మంగళవారం మొక్కు చెల్లించుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఏపీ సిఐడి పోలీసులు అక్రమంగా బనాయించిన కేసుల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

కోర్టులో బెయిల్ మంజూరు అవ్వాలని కోరుతూ గతంలో న్యూఢిల్లీలోని హజారత్ నిజాముద్దీన్ బాబా దర్గాను కలిశెట్టి అప్పలనాయుడు

దర్శించుకున్న విషయం తెలిసిందే. కోర్టులో బెయిల్ లభించి, ఏపీ సిఐడి పోలీసులు అక్రమంగా బనాయించిన కేసుల నుంచి చంద్రబాబు నాయుడు

ఊరాట కలిగితే, మళ్లీ రెండో దపా దర్గాను సందర్శించుకుని మొక్కు చెల్లించుకుంటానని అప్పలనాయుడు అప్పట్లో సంకల్పించుకున్నారు. అయితే తాను
సంకల్పించుకున్నట్టే ప్రస్తుతం కోర్టులో చంద్రబాబు నాయుడు కి ఇదే కేసుకు సంబంధించి బెయిల్ ముంజూరవ్వటం, తెలుగుదేశం, జనసేన పార్టీల

మధ్య పొత్తు కుదరడంతో మంగళవారం న్యూఢిల్లీలోని హజారత్ నిజాముద్దీన్ బాబా దర్గాను అప్పలనాయుడు దర్శించుకుని మొక్కులను చెల్లించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం

అవ్వాలని.చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాల తోపాటు వారికి సుఖ జీవనం సంప్రాప్తించాలని హజారత్ నిజాముద్దీన్ బాబాను అప్పలనాయుడు వేడుకున్నారు. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖ సౌఖ్యాలు సంప్రాప్తించాలని దర్గాలో మొక్కుకున్నారు. ఇదే రోజున

న్యూఢిల్లీలోని హజారత్ నిజాముద్దీన్ బాబా దర్గాను సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వారిలో అప్పలనాయుడు తో పాటు కుప్పం నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్ ఎస్ జయశంకర్, టెక్కలి కి చెందిన అజయ్ తదితరులు ఉన్నారు.

Whatsapp Image 2023 12 05 At 5.36.41 Pm

SAKSHITHA NEWS