SAKSHITHA NEWS

రామాలయానికి రూ.4.19 కోట్ల కరెంట్ బిల్

AP: రామాలయానికి ప్రతినెలా వెయ్యి లోపు వచ్చే కరెంట్ బిల్ ఈసారి ఏకంగా 4.19 కోట్లు రావడంతో అందరూ షాకయ్యారు. కాకినాడ (D) Uకొత్తపల్లి మండలం మూలపేటలో ఈ ఘటన జరిగింది. ఆగస్టులో 1.7 కోట్ల యూనిట్ల కరెంట్ వినియోగించినట్లు బిల్లులో కనిపించింది. వెంటనే విద్యుత్ శాఖ AEని ఆలయ నిర్వాహకులు సంప్రదించారు. రీడింగ్ స్కాన్ చేసే టైంలో పొరపాటు జరిగిందని, కొత్త బిల్లు ఇస్తామని AE వెల్లడించారు.


SAKSHITHA NEWS