దివంగత సీనియర్ నాయకులు కూన వెంకటేష్ గౌడ్ 68వ జయంతి సందర్భంగా KVS కన్వెన్షన్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ తో పాటు వారి కుటుంబ సభ్యులు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని కూన వెంకటేష్ గౌడ్ సేవలను స్మరించుకున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
