శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల

Sakshitha news

సాక్షిత చేవెళ్ల నియోజకవర్గం:-*శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లోని బాలికలకు సినీ నటి మంచులక్ష్మీ మరియు రత్న రెడ్డి తో కలిసి శానిటరీ ప్యాడ్స్ మరియు ప్లేట్లు గ్లాసులను పంపిణీ చేసిన చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నా నియోజకవర్గంలో ఈ సేవ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్న సినీ నటి మంచు లక్ష్మీ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ విద్యార్ధుల కోసం 1 డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్ తీసుకురావడం జరిగిందన్నారు.

◆ లక్ష్మీ మాంచు యొక్క ‘టీచ్ ఫర్ చేంజ్’ మరియు రత్నా రెడ్డి యొక్క ‘వేని రావు ఫౌండేషన్’ తెలంగాణలో విద్యా మరియు ఆరోగ్య కార్యక్రమాలను విస్తరించనున్నాయన్నారు.

◆ నటీమణి-సామాజిక సేవకురాలు లక్ష్మీ మంచు
స్థాపించిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థ, సేవాభావి రత్నా రెడ్డి నేతృత్వంలోని వేని రావు ఫౌండేషన్ తో కలిసి, తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం మరియు ఆరోగ్య ఫలితాలను అభివృద్ధి చేయడంలో కొనసాగుతోందన్నారు.

◆ తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 45 స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల విజయవంతమైన అమలును కొనసాగిస్తూ, వేని రావు ఫౌండేషన్ ఇప్పుడు జన్వాడలో మరో 2 స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేయనుందనీ ఈ ఆధునిక డిజిటల్ తరగతి గదులు విద్యను మరింత ఆసక్తికరంగా, పరస్పర చర్యలతో కూడినదిగా, అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.