SAKSHITHA NEWS

5 వేల మందితో వైరాలో సీఎల్పీ నేత భట్టి భారీ ర్యాలీ

75వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆజాదీ కా గౌరవ్ యాత్రను నాలుగవ రోజు శుక్రవారం నాడు వైరా నియోజకవర్గం కేంద్రానికి చేరుకున్న సందర్భంగా 5వేల మందితో వైరా కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు రాందాస్ నాయక్, బాలాజీ నాయక్ లు ఘనంగా స్వాగతం పలికారు. 100 మంది
లంబాడి మహిళలు గిరిజన సాంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి తలపైన మూడు బిందెలను ఎత్తుకొని బంజారా బేరి సాంస్కృత నృత్యం చేశారు. బోనాలు ఎత్తుకొని మహిళలు పాదయాత్రకు వెల్కం చెప్పారు. వివిధ కళారూపాలు, కోలాటం మహిళల నృత్యాలు, పాదయాత్ర ముందు విశేషంగా ప్రజలను ఆకట్టుకున్నాయి. డీజే సౌండ్లు, పెద్ద ఎత్తున కాల్చిన బాణాసంచా శబ్దాలు పాదయాత్రలో హోరెత్తాయి. దారి పొడవున భట్టి విక్రమార్క పైన బంతిపూల వర్షం కుమ్మరిస్తూ కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. దాదాపుగా కిలోమీటర్ పొడవునా భారీ ర్యాలీ కొనసాగింది. రాఖీ పండుగ సందర్భంగా భట్టి విక్రమార్క గారికి రాఖీ కట్టడానికి మహిళలు పెద్ద ఎత్తున పోటీపడ్డారు.


SAKSHITHA NEWS