SAKSHITHA NEWS

ముగియనున్న 5 లక్షల ప్రమాద బీమా ….. మాజీ ఎంపీటీసీ బద్దం సురేందర్ రెడ్డి

శంకరపల్లి : కొండకల్ మాజీ ఎంపీటీసీ బద్దం సురేందర్ రెడ్డి గ్రామ ప్రజలకోసం 5 లక్షల ప్రమాద బీమా చేపిస్తున్నారు. ఈ ప్రక్రియ ఆగస్ట్ 14 నుండి గ్రామ పంచతి లో జరుగుతుంది అని తెలియజేశారు. ప్రమాద బీమా ప్రక్రియ చివరి తేదీ ఆగస్ట్ 18 వరకు ఉండగా , స్వాతంత్ర దినోత్సవం మరియు రాఖీ పండగ, 3 రోజులు సెలవు దినాలు ఉండడం తో ఈ ప్రక్రియ రేపటి వరకి అనగా ఆగస్ట్ 20 వరకు జరుగుతుందన్నారు .ప్రమాద బీమా ప్రక్రియ రేపటితో ముగియడం తో ఇంకా ప్రమాద బీమా చేసుకోనివారు ఆధార్ , పాన్ కార్డ్ తీసుకొని గ్రామపంచతి లో చేయించుకోగలరని మరొకసారి తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న పిల్లలు వివిధ ప్రమాదాలకి గురవుతున్నారు.పేద ప్రజలకి నా వంతు సహాయం చేస్తున్నాను అని అన్నారు.

WhatsApp Image 2024 08 19 at 19.49.20

SAKSHITHA NEWS