SAKSHITHA NEWS

ఏపీకి అదనంగా 30 మంది ఐపీఎస్ లు

13 జిల్లాలను 26 జిల్లాలగా మార్చిన క్రమంలో ఏపిలో ఐపీఎస్ ల కొరత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనపు ఐపీఎస్లును కేటాయించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం
చంద్రబాబు రాష్ట్రంలో ఐపీఎస్ల కొరత, ఇతర అంశాలపై
వివరించారు. కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా మరింత
మంది అధికారుల అవసరము ఉందని విన్నవించారు.
ఈనేపథ్యంలో కేంద్ర హోం శాఖ అదనంగా 30 మంది IPS అధికారుల్ని కేటాయించింది. దీంతో ప్రస్తుతం ఏపీలో 144గా ఉన్న ఐపీఎస్లు సంఖ్య 174కి చేరనుంది.


SAKSHITHA NEWS