SAKSHITHA NEWS

సాక్షిత గుడివాడ : వేడుకల్లో పాల్గొని బాబా వారికి పవిత్ర గంధాన్ని సమర్పించి….. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని


-కుల,మతాలకతీతంగా ప్రజలందరిపై ఖాదరి బాబావారి ఆశీస్సులు ఉండాలి….
గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం పంచాయతీ పరిధిలో బంటుమిల్లి రోడ్డులో హజ్రత్ మస్తాన్ అవులియ ఖాదరి బాబావారి దర్గాలో 18వ గంధ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని బాబా వారికి పవిత్ర గంధాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సర్వ మానవాళి హితం కోరుతూ మత గురువులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఖాదరీ బాబా వారి గంద మహోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని, బాబా వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు.

ప్రతి ఏటా వేడుకల్లో పాల్గొనడమే కాక దర్గా అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికు మత గురువులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కుల మతాలకు అతీతంగా నిర్వహించిన గంధ మహోత్సవ అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు.తొలుత వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నానిను మైనార్టీ పెద్దలు ముస్లిం సంప్రదాయం ప్రకారం సత్కరించారు. ఈ కార్యక్రమంలో దర్గా షరీఫ్ ఖాన్ ఖా ఎ మష్ కూరియా కమిటీ సభ్యులు బాజీ అలీషా, జాన్ సైదా, షేక్ హుస్సేన్, వైసిపి మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ, వైసిపి నాయకులు పాలేటి చంటి,నల్లమోతు జగదీష్, రజాక్ భాష, ఎండి సాలేహ,ఫజల్,అబ్దుల్ రషీద్,షఫీ, మైనార్టీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS