SAKSHITHA NEWS

ఘనంగా క్రీస్తు సంఘం చర్చిలో 11వ వార్షికోత్సవం… పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ లోగల రాజీవ్ గృహకల్ప 34వ బ్లాక్ పక్కన పాపిరెడ్డి కాలనీలోని క్రీస్తు సంఘం చర్చిలో 11వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా క్రీస్తు సంఘం వారు కార్పొరేటర్ ని శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు.

అనంతరం పాస్టర్ వందన కుమార్ ఏసుక్రీస్తు నామాన్ని స్మరిస్తూ క్రైస్తవులకు పవిత్రమైన చర్చలలో బైబిల్ నందు అంశాలతో ప్రార్థనలు చేసి దేవుని కృపకు పాత్రులు అయ్యారు. ఈ వేడుకను తిలకించేందుకు కాలనీలోని భక్తులు పెద్దఎత్తున వచ్చారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రేమకు శాంతికి ఆధ్యాత్మిక చింతనకు ఏసుక్రీస్తు గొప్పప్రతిక అని అన్నారు.

ఏసు క్రీస్తు చెప్పిన మార్గంలో సాటి మనిషిని ప్రేమానురాగాలతో పలకరిస్తూ, మంచిని ఆస్వాదించి సహాయపడుతూ ఉండాలని అన్నారు. భవిష్యత్తులో చర్చి అభివృద్ధి కావాలని తన వంతు కృషి ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ శ్రీకళ, బస్వరాజ్ లింగయత్, మెషేక్, చిట్టిబాబు, మూర్తి, ప్రభాకర్, జయ, రోజా, సుధారాణి, భాగ్యలక్ష్మి, జమ్మయ్య, రాజు, సతీష్, రాజేష్, ఆనంద్, వెంకట్, నాగబాబు, సందీప్, వినయ్, నర్సింహులు, శ్రీకాంత్, ధీరజ్, సైదులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS