మహిళా ఎమ్మెల్యేల అవమానంపై బీఆర్ఎస్ నిరసన
మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి జరిగిన అవమానంపై క్షమాపణ చెప్పాల్సిందే అంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలని, ఇది కేవలం ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం కాదని, యావత్ తెలంగాణ మహిళలకు జరిగిన అవమానం అని పేర్కొన్నారు.
ప్రతిపక్ష సభ్యుల గొంతును అణచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొంటూ, ఈ పరిణామాలను నిరసిస్తూ 08-09-2026 మంగళవారం ఉదయం 8 గంటలకు బాచుపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ఈ ధర్నాలో నిజాంపేట్ NMC మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట్ సర్కిల్ BRS పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కాసాని వీరేశ్, కాసాని సుధాకర్, ఆగం రాజు, బాలాజీ నాయక్, గాజుల సుజాత, దేవి చందు మ…


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST