విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరికీ శుభం కలగాలి:: మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ .
ఉయ్యూరు పదవ వార్డులో కొబ్బరి తోట యువత ఆధ్వర్యంలో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలలో తొలి ఘట్టమైన వినాయకుని ఆగమనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ వై.వి. బి. రాజేంద్ర ప్రసాద్ పాల్గొని గణేశుని విగ్రహాన్ని ఆవిష్కరించి, పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…..
వినాయకుడు జ్ఞానానికి, శక్తికి, విజయానికి ప్రతీక అని మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయమని అన్నారు.
వినాయకుని ఆశీస్సులతో మన ఉయ్యూరు టౌను మరియు కొబ్బరి తోట ప్రాంతం అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆనందోత్సాహాలతో, సంతోషంగా ఉండాలని , ఉయ్యూరు ప్రజలందరికీ మంచి జరగాలని రాజేంద్రప్రసాద్ ఆకాంక్షించారు…
ఈ కార్యక్రమంలో వార్డు మాజీ కౌన్సిలర్ పల్యాల శ్రీనివాసరావు, పలీయాల రమేష్, సయ్యద్ అజ్మతుల్లా, ఆకుల పండు, బొబ్బిలి పూర్ణ, ఈశ్వర్, అనిల్, రాఘవ, చరణ్, సాయి, గౌరీ. తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST