SAKSHITHA NEWS

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి వీఆర్టీయూటీఎస్ కృషి

సాక్షిత చేవెళ్ల : పిఆర్టియుటీఎస్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ యాదవ్ ప్రధాన కార్యదర్శి సామల మహేందర్ రెడ్డి
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సంఘం పి ఆర్టియు సంఘమని జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ యాదవ్ తెలిపారు. PRTUTS చేవెళ్ల మండలం సర్వసభ్య సమావేశం సత్తయ్య అధ్యక్షతన మల్కాపూర్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి సామల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పిఆర్టియు సంఘానికి ఉపాధ్యాయులు అండగా ఉండాలని ఉపాధ్యాయుల సమస్యల గురించి నిరంతరంగా పోరాటం చేసే సంఘం పిఆర్టి టి ఎస్ అని త్వరలోనే సర్వీస్ రూల్స్ ను తీసుకొస్తామని తెలిపారు ఈ సమావేశంలో పిఆర్టియుటిఎస్ చేవెళ్ల మండల శాఖ అధ్యక్షులుగా దయానందం ,ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్ అసోసియేట్ అధ్యక్షులుగా జాన్సన్ ,మహిళా ఉపాధ్యక్షురాలుగా సంగీత ,కార్యదర్శిగా శివకుమార్ ,మహిళా కార్యదర్శిగా అనిత ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు


SAKSHITHA NEWS