SAKSHITHA NEWS

తులసి నగర్ లో పాదయాత్ర చేసిన వెంకటేష్ గౌడ్

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని తులసి నగర్ లో జిఎచ్ఎంసీ అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేసి వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. వర్షాల వల్ల రోడ్ల మీద పేరుకుపోయిన మట్టిని మరియు నాళాలలోని పూడికను పారిశుద్ధ్య కార్మికులతో తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలోని అన్ని గల్లీలలో డ్రైనేజీ మరియు రోడ్ల పెండింగ్ వర్క్స్ అన్నింటినికి ఎస్టిమేషన్ వేసి ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు.

కాలనీలోని రోడ్డు నెంబర్ 2A లో వాటర్ లైన్ లోతుగా ఉండి ప్రెజర్ రావడం లేదని కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకుని రాగా వెంటనే వాటర్ లైన్ సమస్యను పరిష్కరించి, సీసీ రోడ్డు కూడా వేయాలని అధికారులతో చర్చించారు. డ్యామేజ్ అయిన మాన్ హోల్ మూతలను వెంటనే మార్చాలని జలమండలి అధికారులను ఆదేశించారు. కాలనీ వెల్ ఫెయిర్ అసోసియేషన్ సభ్యలు మరియు జిఎచ్ఎంసీ అధికారులు సమన్మయంతో పనిచేసి కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, అధ్యక్షులు అనిల్ రెడ్డి, శివరాజ్ గౌడ్, రామకృష్ణ బాబాయ్, పోశెట్టిగౌడ్, వాసుదేవరావు, శ్రీనివాస్, శంకర్ రావు, సుకుమార్, ప్రేమ్ కుమార్, సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగేశ్వరరావు, సాయి గౌడ్, జిఎచ్ఎంసీ ఏఈ శివ ప్రకాష్, వర్క్ ఇస్పెక్టర్స్ రవి కుమార్ మరియు రవీందర్ రెడ్డి, కాలనీ మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS