SAKSHITHA NEWS

varla ఉయ్యూరు.

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ;;తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు. వై వి బి రాజేంద్ర ప్రసాద్

పామర్రు నియోజకవర్గం నుండి శాసన సభ్యుడిగా ఎన్నికైన వర్లకుమర్ రాజా గారిని తెదేపా ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్రప్రసాద్ గారు మర్యాదపూర్వకంగా అభినందించారు,

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ యువకుడు ఉత్సాహవంతులైన కుమార్ రాజా పామర్రు శాసనసభ్యుడు గా ఎన్నికవడంతో నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడవబోతుందని అన్నారు, నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవలేదని కార్యకర్తల కృషి కుమార్ రాజా కష్టంతో భారీ మెజారిటీ తో తెలుగుదేశం పార్టీ గెలుచిందన్నారు,పామర్రు నియోజకవర్గం లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందనీ కుమార్ రాజా రోడ్ల పై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు .

ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా,బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజులపాటి ఫణి కుమార్,సాయి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

varla

SAKSHITHA NEWS