SAKSHITHA NEWS

విశ్వ నగరాభివృద్ధిని బడ్జెట్ లో పూర్తిగా విస్మరించారు…. : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

తెలంగాణ బడ్జెట్ సమావేశంలో భాగంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్లో మహానగరాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ….

మహానగరాన్ని నలుమూలల అనుసంధానం చేస్తూ ఎంతోమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చే హైదరాబాద్ మెట్రో కు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు.

హైదరాబాద్ నగరానికి ప్రతి సంవత్సరం పదివేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నా మాటలు చెప్పడానికే కానీ చేతల్లో ఉండవని మరో మారు నిరూపిస్తూ హైదరాబాదు నగరానికి నిధులు కేటాయించకపోవడం నగరవాసులను తీవ్రంగా అవమానించడమే.

గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టి పూర్తిచేసిన ఎస్ఎన్డిపి, ఎస్.ఆర్.డి.పి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటు.

తెలంగాణను పూర్తి ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా మార్చేందుకు మా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంలో శంకుస్థాపన చేపట్టిన మల్టీస్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. దీంతో నిరుపేదలకు అందాల్సిన వైద్యం మరింత ఆలస్యం కానుంది.

బడ్జెట్లో ఉన్న నగరాన్ని విస్మరించి ముఖ్యమంత్రి ఊహల నగరమైన ఫ్యూచర్ సిటీ కేంద్రంగా నిధుల కేటాయింపు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ప్రజలను మోసం చేయడానికి ఒక ఎత్తుగడ మాత్రమేగానీ, అభివృద్ధి సంక్షేమం గురించి కాదు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app