SAKSHITHA NEWS

అంతర్జాతీయ వార్షిక సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్

హైదరాబాద్:
భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచం విస్మరించదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని ఆకాంక్షించారు. దూరంగా ఉన్న అమెరికా అయినా, అతి సమీపంలో ఉన్న చైనా అయినా ఏ దేశమైనా భారత్‌ను విస్మరించదని కేంద్ర మంత్రి సీతారామన్ వాక్యనించారు.

వాషింగ్టన్, DCలో ప్రపంచ బ్యాంక్ మరియు అంతర్జా తీయ వార్షిక సమావేశాలు 2024 సందర్భంగా సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ నిర్వహించిన ‘బ్రెట్టన్ వుడ్స్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎట్ 80: ప్రయారిటీస్ ఫర్ ది నెక్స్ట్ డికేడ్’ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమం లో పాల్గొన్న సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు.

భారతదేశం ఎల్లప్పుడూ బహుపాక్షిక సంస్థలకు మద్దతునిస్తుంది. ఏ సమ యంలోనూ ఏ బహుపాక్షిక సంస్థను బలహీనపరచ డానికి ప్రయత్నించలేదు. బహుపాక్షిక సంస్థల నుంచి ఎలాంటి పరిష్కారాలు రాకపోవడంతో వాటిపై అంచనాలు అడియాసల య్యాయని ఆమె అన్నారు.


SAKSHITHA NEWS